ఎగ్జిమ్ బ్యాంక్ లో 25 మేనేజ్మెంట్ ట్రెయినీలు
ఎగ్జిమ్ బ్యాంక్ లో 25 మేనేజ్మెంట్ ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎగ్జిమ్ బ్యాంక్ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
అర్హత : కనీసం 65 శాతం మార్కులతో ఎంబీఏ / పీజీడీబీఏ ( ఫైనాన్స్ స్పెషలైజేషన్ ) ఉత్తీర్ణత .
వయసు : 2022 సెప్టెంబరు 30 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం : దీనిని ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు . నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది . తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు ( 1/4 ) కట్ చేస్తారు . ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మాధ్య మంలో ఉంటుంది . ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు .
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .600 , ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్య ర్థులు రూ .100 చెల్లించాలి
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 14
రాత పరీక్ష : 2022 ఏప్రిల్
వెబ్సైట్ : https://www.eximbankindia.in/
Comments
Post a Comment