నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ మిధానిలో భారీగా ఉద్యోగాలు..
హైదరాబాద్ కంచన్బాగ్లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్(మిధాని) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది....
దీనిద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీచేయనున్నారు. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 1లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు....
* ఖాళీల సంఖ్య: 54
➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఫిట్టర్): 13 పోస్టులు
➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (వెల్డర్): 02 పోస్టులు
➥ జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్): 06 పోస్టులు
➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెటలర్జీ): 20 పోస్టులు
➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెకానికల్): 10 పోస్టులు
➥ సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్/ విభాగంలో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18.10.2023 నాటికి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు.
పే స్కేల్: నెలకు జేవోటీ పోస్టులకు రూ.20,000. ఎస్ఓటీ పోస్టులకు రూ.21,900 చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.11.2023.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
government jobs
ReplyDelete