భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ (India Post).. గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ను విడుదల చేసింది భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), అసిస్టెంట్బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి స్పెషల్ సైకిల్ మే-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పదో తరగతి సబ్జెక్టుల్లో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా చదివి ఉండాలి. అంటే.. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివి ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి. సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయసు జూన్ 11, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జూన్ 11, 2023వ తేదీలోపు దరఖాస్త
Comments
Post a Comment